జహీరాబాద్, ఆగస్టు 7 : అక్రమంగా నిల్వ చేసిన 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్కు తరిలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు.
జహీరాబాద్ మండలంకొత్తూర్(బి) గ్రామ శివారులో మూతబడిన ఫ్యాక్టరీ వద్ద లారీలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పౌర సరఫరాల అధికారులతో కలసి 180 క్వింటాళ్ల బియ్యంతో పాటు లారీను సీజ్ చేశామన్నారు.
లారీ ఓనర్ బానోత్ హరిసింగ్ను ఆదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైన అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.