జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొంత భనాలను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన జంగంపేట పంచాయతీలో హెటిరో పరిశ్రమ సహకారంతో రూ.35లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సహకారం బాగానే ఉందన్నారు.
కొన్ని పరిశ్రమలు మాత్రమే గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాయని, మిగత పరిశ్రమలు కూడా సహకరించాలన్నారు. కొత్త పంచాయతీలకు యుద్ద ప్రాతిపదికన శాశ్వత పంచాయతీ భవనాలు నిర్మిస్తామన్నారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండల ఉపసర్పంచ్ గోవర్దన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.