అందోల్, ఆగస్టు 15 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 8ఏండ్ల కాలంలో ఎలాంటి ఫైరవీలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. గతంలో 60 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందజేయగా నేడు సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి 57 సంవత్సరాలు నిండిన వారికి సైతం పింఛన్లు అందజేస్తుందన్నారు.
పింఛన్కు అర్హులుగా ఉండి పింఛన్ రానివారు ఎవరైనా ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు అందుకు సహాకరించి అర్హులైన లబ్ధిదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ మండలాధ్యక్షుడు శివశేఖర్, నాయకులు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.