మెదక్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ ట్రస్ట్)లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డీఎంఎఫ్టీ మెంబర్ సెక్రటరీ రాజర్షి షా మాట్లాడుతూ డీఎంఎఫ్టీ మెదక్ జిల్లాలో పనుల వివరాలు, పూర్తి చేయాలనుకున్నవి, కొనసాగుతున్నవి, ఇప్పటి వరకు మొదలు కాని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డీఎంఎఫ్టీలో మొత్తం 181 పనులకు రూ.26,23,64,000 లక్షల విలువ గల పనుల వివరాలను అధికారులు కలెక్టర్కు తెలిపారు. వీటిలో 102 పనులు పూర్తి చేశామన్నారు. దీంతో, పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శైలేశ్, సీపీవో కృష్ణయ్య, పీఆర్ ఈఈ నర్సింహులు, ఆర్అండ్బీ అధికారి సర్దార్ సింగ్, ఈడబ్ల్యూఐడీసీ ఆన్సర్ అలీ తదితరులు పాల్గొన్నారు.