పటాన్చెరు ( సంగారెడ్డి ) : సీఎం కేసీఆర్ సర్కారు బడులను బలోపేతం చేశారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి (MLA Mahipal Reddy ) అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) విద్యారంగానికి ( Education Sector ) అధిక నిధులు కేటాయిస్తున్నారని వివరించారు.
విద్యారంగం బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలను బలోపేతం చేశారని, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. సర్కారు బడులకు మన ఊరు, మనబడిలో భాగంగా నిధులు కేటాయించి కొత్త రూపురేఖలు కల్పించామన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపర్చామని వెల్లడించారు.కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడులు పనిచేస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు బోధిస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయుల కృషితో సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమంలో చక్కటి బోధన జరుగుతున్నదన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 75మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మాశ్రీ వేణుగోపాల్రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.