సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 25 : సంగారెడ్డి మున్సిపల్ పాలక వర్గం శుక్రవారం మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మునిపల్ అభివృద్ధికి రూ. 50కోట్ల నిధుల కేటాయింపునకు సహకరించిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లతతో పాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ మంత్రిని కలిసి పుష్ప గుచ్ఛాలను అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిధులను సక్రమంగా వినియోగించుకొని అవసరమున్న అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని సూచించారు. వార్డుల వారీగా పర్యటించి స్థానికులతో చర్చించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు వీణా శ్రీనివాస్, రామప్ప, విష్ణువర్ధన్, శ్రీకాంత్, అశ్వక్, సోహెల్, జలేందర్రావు, నాయకులు బొంగుల రవి, ప్రదీప్, హరికిషన్, వెంకటేశం, చంద్రశేఖర్, శ్రీనివాస్, అజ్జు, నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.