సంగారెడ్డి : మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, మహ్మద్ ఫరీదుద్దీన్ పార్థీవదేహానికి జహీరాబాద్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మణిక్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అ భగవంతున్ని ప్రార్థించారు. ఫరీదుద్దీన్తో తముకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కాగా, ఫరీదుద్దీన్ (64) గత కొంత కాలంగా అనోరోగ్యంతో బాధపడుతున్నారు. వారం క్రితమే హైదరాబాద్లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్లో కాలేయ శస్త్రచికిత్స జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఫరీదుద్దీన్కు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.