న్యాల్కల్, ఏప్రిల్ 29 : దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం న్యాల్కల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యానవాన, పట్టు పరిశ్రమ శాఖాల ఆధ్వర్యంలో ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన డ్రిప్ పరికరాలను రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందజేసిన డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకుని రైతులు పంటలను పండించి అర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం మల్కన్పాడ్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాగప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో హార్టికల్చర్ జిల్లా అధికారి సునీత, జహీరాబాద్ డివిజన్ హార్టికల్చర్ అధికారి అనుష, వ్యవసాయ అధికారి లావణ్య, జిల్లా అధికారి ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ అంజమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.