జహీరాబాద్, జనవరి 16 : మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతును అణచి వేస్తుందన్నారు. 2011 జనాభా పరిగణలోకి తీసుకుంటూ చేసిన రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ క్యాటగిరి వార్డులను కుదించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ,ఎస్టీ వర్గాల స్థానాలను పెంచాలనీ డిమాండ్ చేశారు. ఆయా వర్గాలకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషనులు కల్పించడంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలను పెంచుతూ తిరిగి సవరణ చేయాలని లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక పట్టణ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.