గుమ్మడిదల, మార్చి3 : రైతు స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలో మార్క్ఫెడ్, నాఫెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత వయవసాయరంగంలో సరికొత్త ఒరవడి ప్రారంభమైనదన్నారు.
రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సరైన మద్దతు ధర అందించడం మూలంగా వ్యవసాయ రంగం లాభాల బాట పట్టిందన్నారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 50 మంది రైతులకు రేన్బో సంస్థ ద్వారా 50శాతం సబ్సిడీపై మంజూరైన విద్యుత్ మోటర్లు, పైపులు ఎమ్మెల్యే అందజేశారు.
అనంతరం సబ్సిడీపై వచ్చిన 13 యూనిట్ల గొర్రెలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంఏవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్దన్రెడ్డి, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.