గుమ్మడిదల, మార్చి25: ఆడబిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలకు అప్పులపాలు కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అప్పటి నుంచి పేదింటి ఆడబిడ్డల పెండ్లింటా కల్యాణ కాంతులు విరబూస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం గుమ్మడిదల మండల కేంద్రంలో 44 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు అండగా నిలవడానికి సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టి ఆదుకుంటున్నారన్నారు. అనంతరం మండల కేంద్రంలోని బాపనింటి ఎల్లమ్మ మందిరం సమీపంలో ఆలయ ముఖద్వారానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణారెడ్డి, వైస్ఎంపీపీ మంజుల, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్లు ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి,మమతావేణు, రాజశేఖర్, ఆంజనేయులు, డీ.శంకర్,గోవర్ధన్రెడ్డి,తిరుమలవాసు, రేణుకస్వామి, ఎంపీటీసీలు ప్రభాకర్రెడ్డి, పార్వతమ్మ, పద్మాకొండల్రెడ్డి, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.