గుమ్మడిదల, నవంబర్15 : నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నల్లవల్లి గ్రామంలో రూ. 10 లక్షల సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం గుమ్మడిదల మండల కేంద్రంలో రూ. 60 లక్షల సీఎస్ఆర్ నిధులతో పలు బస్తీల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, పాలకవర్గం సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్రెడ్డి తదితరులు కలిసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం హెటిరోడ్రగ్స్ పరిశ్రమ రూ. 40 లక్షలు, హారికల్యాబ్ పరిశ్రమ రూ. 10 లక్షలు, మహాసాయి ల్యాబ్ రూ. 10 లక్షలు, ఎంఎస్ఎన్ పరిశ్రమ రూ. 10 లక్షల సీఎస్ఆర్ నిధులు కేటాయించిండం అభినందనీయమన్నారు.
అనంతరం గుమ్మడిదలలో ఎల్లమ్మ ఆలయ పునర్మిణానానికి భూమి పూజ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయ పునర్మిణానానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో భూమి పూజ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.