సిర్గాపూర్/ కల్హేర్ జూలై 29 : రైతులు దళారుల చేతుల్లో మోస పోవద్దనే సీఎం కేసీఆర్ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని బొక్కస్గాం, కృష్ణాపూర్ గ్రామాల్లోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు పండించిన జొన్న పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. సీఎం సానుకూలంగా స్పందించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేనివిధంగా మద్దతు ధర ప్రతి క్వింటాలుకు రూ.2,738 కల్పించారని పేర్కొన్నారు.
రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జిల్లా సొసైటీ డెరెక్టర్ వెంకట్రాములు, ఆత్మ కమిటీ చైర్మెన్ రాంసింగ్, జడ్పీటీసీలు, రాఘవరెడ్డి, నర్సింహరెడ్డి, ఎంపీపీ మహిపాల్రెడ్డి, గుర్రపు సుశీల అంజయ్య, పార్టీ అధ్యక్షుడు సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.