మనూరు, జూన్ 30 : పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మనూరు ఎంపీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ప్రతి నిరుపేదకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
గతంలో పార్టీల నాయకులు, కార్యకర్తలకు సంక్షేమ పథకాలు చేరేవన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారని విమర్శించారు.
వానకాలం పంట పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విఠల్రావు, వైస్ ఎంపీపీ రాములు, తహసీల్దార్ మురళీ, బెల్లాపూర్ ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి, నాయకులు నాగేందర్రావు పాల్గొన్నారు.