సంగారెడ్డి : బొల్లారం మున్సిపల్ పరిధిలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కన మూతపడ్డ పరి శ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ రెడ్డితో పాటు వెంకటయ్య వాటర్ ట్యాంకర్ తీసుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.
అనంతరం మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్, పటాన్ చెరు అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి ఖాళీ ప్రదేశంలో పడేయడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.