న్యాల్కల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగ్వార్, కల్బేమల్, బసంత్ పూర్ గ్రామాల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే గంగ్వార్ గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయా గ్రామాల్లో ఆసరా పథకం కింద మంజూరైన పింఛన్ ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలలో రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీ అంతర్గత రోడ్ల లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు.
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తూ గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేలా ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, జడ్పీటీసీ స్వప్న కుమారి, ఎంపీపీ అంజమ్మ, ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రెహమాన్, ఎంపీడీవో సుమతి, సూపరింటెండెంట్ రాజశేఖర్, పంచాయతీ అధికారి నాగభూషణం, ఆయా గ్రామాల సర్పంచులు జయశ్రీ రెడ్డి, మైపాల్, పీటర్ రాజ్, శ్యామల, చంద్రన్న, మండల నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగరావు పాటిల్, నరసింహారెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి సిద్ధారెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.