సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా మంగళవారం 5గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం చివరి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలో భాగంగా జరిగిన ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 94.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
మొత్తం 14,825 మంది విద్యార్థులకు గాను 14,005 మంది విద్యార్థులు హాజరయ్యారు. 820 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో మాల్ప్రాక్టీసింగ్కు పాల్పడుతూ 5 మంది విద్యార్థులు డిబార్ అయినట్టు అధికారులు తెలిపారు.
కాగా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్రామ్ ఒక పరీక్ష కేంద్రాన్ని సందర్శించగా.. 6గురు డీఈసీ సభ్యులు, 4గురు హెచ్పీఎస్ సభ్యులు, 7 ఫ్లైయింగ్ స్కాడ్, 4 సిట్టింగ్ స్కాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించాయి. మొత్తం మీద బుధవారం మొదటి సంవత్సరం పరీక్షలు, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.