సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 12 : 108 అంబులెన్స్లో గర్భిణి ప్రసవించిన సంఘటన శనివారం రాత్రి కంది మండల పరిధిలో చోటు చేసుకుంది. తునికల తాండాకు చెందిన గర్భిణి సంతోష కు పురిటి నొప్పులు రావడంతో 108లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించే ప్రయత్నంలో అంబులెన్స్లోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది.
108 సిబ్బంది తల్లీబిడ్డను ఎంసీహెచ్ సంగారెడ్డి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. మగ బిడ్డ జన్మించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ 108 అబులెన్స్ సిబ్బంది బి.చిరంజీవి, డ్రైవర్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు.