ఝరాసంగంఆగస్టు8 : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రెండో శ్రావణ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.
భక్తుల శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. బీదర్కు చెందిన శివస్వామి భక్తులకు అన్నదాన్న చేశారు.