న్యాల్కల్ : గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామతాబాద్, గుంజేటి, ముంగి, న్యాల్కల్, అత్నూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే కోటా కింద ఐదు లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకే నిధులను మంజూరు చేశానన్నారు. అనంతరం హద్నూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ వీరమని రాజ్ కుమార్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి బసవేశ్వర విగ్రహాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ , వైస్ ఎంపీపీ గౌసోద్దీన్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, సర్పంచులు సుమిత్ర భాయి, రవికుమార్, మల్లారెడ్డి, మారుతీ యాదవ్, అమీర్ మైపాల్, చంద్రన్న ,చెన్నమ్మ, సురేఖ, అనిత, ఎంపీటీసీలు దేశెట్టి పాటిల్, విజయలక్ష్మి,మండల నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్ , చంద్రప్ప, రాజ్ కుమార్ ప్రవీణ్ కుమార్, బసవరాజ్ పటేల్, సంగ్రాం పాటిల్, బక్క రెడ్డి, భూమారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అప్పారావు, దేవదాస్, షకీల్, ఎంపీ ఓ నాగభూషణం, పీఆర్ ఏవో ఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.