బొల్లారం, ఏప్రిల్ 29 : మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన ప్రాథమిక పాఠశాలలో 20 లక్షల రూపాయల నిధులతో కంపౌండ్ వాల్, బిల్డింగ్ నిర్మాణ పనులకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ రోజాబాల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు, కౌన్సిలర్ చంద్రారెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, కౌన్సిలర్లు, ఇంచార్జీ ఎంఈవో విజయ, హెచ్ఎం శశిధర్, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.