మునిపల్లి,ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మునిపల్లి మండల కేంద్రంలో రూ.30లక్షలతో నిర్మించనున్న పంచాయతీ ఫంక్షన్ హాల్(కళ్యాణ మండపం)పనుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల ప్రతి పల్లెకు భారీగా నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారని ఆయన ప్రశంసించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు పరుస్తున్నారన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజా, జడ్పీటీసీ మీనాక్షి, రాష్ట్ర నాయకులు సాయికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, గ్రామ సర్పంచ్ రమేష్, యువత విభాగం మండల అధ్యక్షుడు ఆనంద్రావు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మౌలానా తదితరులు ఉన్నారు.