అందోల్, ఆగస్టు 16: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నరని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్టివరకు ఈ పథకం ద్వారా ఎన్నో దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు.
మంగళవారం వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారుడు రంసాన్పల్లి వద్ద ఏర్పాటు చేసుకున్న దాబాను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని అన్నారు.
ఈ పథకం ద్వారా ఎంతో మంది దళితులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని పేర్కొన్నారు. రూ. 10 లక్షలతో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని.. ఇదంతా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ దళితబంధు పథకం అందుతుందని పేర్కొన్నారు.