జహీరాబాద్, అక్టోబర్ 29 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తెలుపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం ఝరాసంగం మండలంలోని సంగం(కే) గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యం కలిపించిందన్నారు. సంగం (కే) గ్రామస్తుల సమస్యలు పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తాన్నారు. ఏ సమస్య ఉన్న నేరుగా వచ్చి తెలుపాలన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు పెద్దగొల్ల నారాయణ, అంజిరెడ్డి, శివన్న, విష్ణు, అశోక్, రమేశ్తో పాటు వంద మంది కార్యకర్తలు ఉన్నారు.
కార్యక్రమంలో జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుగు రాచయ్యస్వామి, జహీరాబాద్ పట్టణ అధ్యక్షుగు మోహినోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.