పటాన్చెరు టౌన్ : ఎలక్ట్రికల్ వాహనాలతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ 113 పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికిల్స్ను ఆయన కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొన్ని ద్విచక్రవాహనాలను నడిపి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా తిరగడానికి ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వాహనాలదే కీలకపాత్ర పోషిస్తాయన్నారు. నిర్వాహకులు ఎలక్ట్రికల్ వాహనాలను పట్టణవాసులకు అమ్మెందుకు తేవడంపై అభినందించారు.
రోజురోజుకు తరిగిపోతున్న ఇందన నిలువల మధ్య సోలార్, ఎలక్ట్రికల్ వాహనాలే దిక్కన్నారు. మెట్టు కుమార్యాదవ్ మాట్లాడుతూ శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా, పెట్రోల్, డిజిల్ లేకుండా నడిచే ఇలాంటి వాహనాలకు అందరు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లగలిగే అవకాశం ఉందని కొనియాడారు. కార్యక్రమంలో విజయ్కుమార్, కౌన్సిలర్ మల్లేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.