సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 11: ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ గేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు జూలైలో నిర్వహించే నిరసన కార్యక్రమాలు వివరించారు. ఉద్యమానికి సంబంధించిన ఫెడరేషన్ డిమాండ్లు వివరిస్తూ కనీస మార్జిన్ క్వింటాళ్లు రూ.440లను విధిగా నిర్ధారించాలని, బియ్యం, గోధుమలు, పంచదార కోసం నష్టాన్ని క్వింటాలుకు ఒక కిలోకు అనుమతించాలని, ఎడిబుల్ ఆయిల్, పప్పులు, ఎల్పీజీ గ్యాస్ సరసమైన ధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలనే పలు డిమాండ్లు వివరించారు.
మెదక్ జిల్లాలో
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్ డీలర్లు సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్ మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు చౌక ధర దుకాణం ద్వారా సరఫరాకు అనుమతించాలని, కుటుంబ సభ్యులకు బీమాసౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని కొల్చారం మండల అధ్యక్షులు ప్రభాకర్, నర్సాపూర్ మండల అధ్యక్షులు నర్సింలు, చిలిపిచెడ్ మండల అధ్యక్షులు అంతాగౌడ్, నిజాంపేట మండల అధ్యక్షులు, అల్లాదుర్గం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, వెల్దుర్తి మండల అధ్యక్షులు శేకులు, మనోహరాబాద్ మండల అధ్యక్షులు అజయ్, బిక్షపతి, చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు నర్సింలు, పెద్దశంకరంపేట మండల అధ్యక్షులు కిష్టయ్య, రేగోడ్ మండల అధ్యక్షులు ప్రభాకర్, మాసాయిపేట మండల అధ్యక్షులు ముజీబ్, చేగుంట మండల అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు జిల్లా నాయకులు నర్సోజీ, విజయ్, సుధాకర్, గోవర్ధన్రెడ్డి, దేవరాజ్తో పాటు జిల్లాలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు.