సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వట్పల్లి మండలం పోతుల బొగుడా గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన పట్లోళ్ల ప్రశాంత పటేల్, కాశీ బాయి,మాణిక్యంతో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లికరుణా పాటిల్, పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.