రాయికోడ్ : రాయికోడ్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వరస్వామి ఆలయంలోని భధ్రకాళి దేవికి 3 కిలోల వెండి వస్తువులను భక్తులు బహూకరించారు. అల్లం శంకరప్ప పాటిల్, అల్లం బక్కప్పపాటిల్ కలిసి దేవాలయ కార్యాలయలంలో గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. ఆలయభివృద్ధికి తమ వంతు సహకరాం అందిస్తామన్నారు. కార్యక్రమంలో పూజరులు రుద్రయ్యస్వామి, బస్వరాజుస్వామి ఉన్నారు.