జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, ఫిబ్రవరి 16 : రక్తదానం ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జనగామ జిల్లా కేం ద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ని యోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్రెడ్డి నేతృత్వంలో మెగా రక్తదానం శిబిరాన్ని ని ర్వహించారు. శిబిరానికి చేర్యాల మున్సిప ల్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి టీఆర్ఎస్ మం డల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, గీస భిక్షపతి, మేక సంతోశ్, మంద యాదగిరి ఆధ్వర్యంలో యువకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 250 మంది యువకులు, కార్యకర్తలు రక్తదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, శెట్టె మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్లు పుర్మ వెంకట్రెడ్డి, నిమ్మ రాజీవ్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్లి తిరుపతిరెడ్డి, నాలుగు మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల బాధ్యులు, ముఖ్య నాయకులు, రైతుబంధు సమితి సభ్యులు, మార్కెట్, మల్లన్న ఆలయ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.