సంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, జడ్పీ, మండల పరిషత్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్ర గతి కార్యక్రమాలను ఇతర రాష్ర్టాల ప్రతినిధులు పరిశీలించేందుకు రావడమే కాకుండా, ఇక్కడి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని, వారి రాష్ర్టా ల్లో అమలుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రా మాల అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి హరీశ్రావు మనందరికి అందుబాటులో ఉన్నారన్నారు. జిల్లాలోని పట్టణాలు, పల్లెల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించాలని, ఎక్కడైనా లోపాలుంటే, వెంటనే ఉన్నతాధికారులు సవరించాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తానని చెప్పారు.
జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ సం గారెడ్డి జడ్పీకి దీన్దయాల్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, అధికారుల సహకారం, కృషితోనే అవార్డు వచ్చిందన్నా రు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి కృషి చేద్దామని సభ్యులకు పిలుపునిచ్చారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు కలిసికట్టుగా పని చేసి, మండలాల అభివృద్ధికి కృ షి చేయాలన్నారు. ఎక్కడైనా అధికారులతో సమస్యలుంటే, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో సభ్యులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను సభ్యులు లేవనెత్తగా, కలెక్టర్ హన్మంతరావు సమాధానాలిఇచ్చారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ధరణి తెచ్చారన్నారు. ధరణితో రైతులకు మేలు జరుగుతున్న ట్లు చెప్పారు. అక్కడక్కడ చిన్న సమస్యలు తలెత్తి నా, వాటిని వెంటనే పరిష్కరిస్తామని సభ్యులకు వివరించారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే, దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. పట్టాదారులకు ఏమైనా సమస్యలుంటే, మీసేవా కేం ద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఫౌతీ, విరాసత్ అమలుకు సంబంధించిన ఆప్షన్ ఇంకా రాలేదని, వ చ్చిన వెంటనే పెండింగ్లో ఉన్నవాటిని పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని తండాలకు రోడ్లు వేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శా ఖలకు సంబంధించి త్వరలోనే మంత్రి హరీశ్రా వు అధ్యక్షతన సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ కుటిల రాజకీయాలను సాగనివ్వం : ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పా ర్టీ కుటిల రాజకీయాలను సాగనివ్వమని, సీఎం కే సీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ని యోజకవర్గంలో వందశాతం అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే తనయుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి, నియోజకవర్గంలో పనులు అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నారని, అతని ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. నల్లవాగు కాల్వలను మరమ్మతులు చేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జ హీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని కలెక్టర్ను కోరా రు. ధరణిలో రెవెన్యూ అధికారులు ఏ కారణం చేతనైనా పట్టాదారుల దరఖాస్తులను తిరస్కరిస్తే, ఎందుకు తిరస్కరిస్తున్నది? తెలియజేయాలన్నా రు. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రైతులు తీర్చినా, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రైతు ల మార్టిగేజ్ పత్రాలను రిలీజ్ చేయడం లేదని, వెంటనే రిలీజ్ చేసేలా చర్యలు చూడాలని చెప్ప గా, పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు.
గంజాయి రవాణా, విక్రయాలకు చెక్
జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయని, దీంతో యువత భవిష్యత్ దెబ్బతింటున్నట్లు జడ్పీటీసీ రమేశ్ సహా పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లా లో గంజాయి అమ్మకాలు జరుగకుండా గట్టి చర్య లు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ హన్మంతరావు స్పందిస్తూ జిల్లాలో ఎక్కడా గంజాయి అమ్మకాలు జరుగకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పంది స్తూ గంజాయి సాగు కావడం లేదని, గంజాయి అమ్మకాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు రాజు రాథోడ్, సునీత మనోహర్గౌడ్, మీనాక్షి, సుప్రజావెంకట్రెడ్డి తమ మండలాల్లోని నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ శాఖలకు సంబంధించి సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా, వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జడ్పీటీసీ, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.