సంగారెడ్డి, డిసెంబర్ 13: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు రిజర్వు పోలీసు సిబ్బంది పాటుపడడంతో పాటు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ మైదానంలో ఆర్ముడ్ రిజర్వు పోలీస్ దర్బార్ నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజలకు పోలీసు యంత్రాంగం సహకరిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుండాలన్నారు. సమాజ పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, ప్రజలతో మమేకవుతూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల గౌరవాన్ని దిగజార్చకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఉంటుందన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధుల్లో(ఏఆర్) సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఏఆర్ పోలీసుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అశోక్, అడ్మినిస్ట్రేటీవ్ అధికారి కల్యాణ, ఏఆర్ డీఎస్పీ జనార్దన్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివలింగం, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ విజయ్కృష్ణ, ఆర్ఐలు రాజశేఖర్రెడ్డి, రామరావు, హన్మిరెడ్డి, ఆర్ఎస్లు, డీపీవో సిబ్బంది ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.