వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం
రూ. 12.85లక్షల నగదు పురస్కారం
ఉత్తమ సేవలు అందించిన సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు
ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్యశాఖ డైరెక్టర్
సంగారెడ్డి, జులై 15: తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి నగదు పురస్కారాలు ప్రకటించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన కాయకల్పకు ఎంపికై ప్రొత్సహాక పురస్కారంతో పాటు రూ.3లక్షల నగదు పొందనున్నది. జిల్లా వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న అర్బన్ హెల్త్ కేంద్రాలు-2, మండల కేంద్రాల్లో సేవలందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-6, గ్రామీణ ప్రాం తాల్లో సేవలందిస్తున్న సబ్సెంటర్లకు నగదు బహుమతు లు అందుకోనున్నాయి. ఇందులో భాగంగా జిల్లా మొత్తం నగదు రూపంలో రూ. 12.85లక్షలు వైద్యరంగంలో విశి ష్ట సేవలకు గాను ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు సీజినల్ వ్యాధులు, దీర్ఘాకాలిక రోగాలపై అప్రమత్తం చేస్తూ సకాలంలో వైద్యం చేయించుకు ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించడంతో పురస్కారాల ప్రాధాన్యతకు అవకాశం వచ్చిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వైద్య సేవలకు పురస్కారాలతో పాటు నగదు ప్రొత్సాహం అందించేందుకు ప్రకటించడంతో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బందిలో రేట్టింపు ఉత్సహం తో విధులు నిర్వహించే అవకాశం కలుగనున్నది.
ప్రోత్సాహకాలు అందుకోనున్న కేంద్రాలు..
జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కేంద్ర దవాఖానకు పురస్కారం లభించింది. ఇందుకు ప్రభుత్వం రూ. 3లక్షల నగదును ప్రకటించింది. దీంతో పాటు మండల కేంద్రాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో న్యాల్కల్ 74.4శాతం సాధించి విజేతగా నిలవడంతో రూ. 2లక్షల నగదు అందనున్నది. అలాగే మరో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గుమ్మడిదల, భానూర్, బొల్లారం, మొగుడంపల్లి, మునిపల్లికి రూ. 50వేల చొప్పున మొత్తం రూ. 2.50లక్షలు నగదు అందుకోనున్నాయి. వీటితో పాటు పట్టణాల్లో వైద్యసేవలు అందించే అర్బన్హెల్త్ కేంద్రాలు సంగారెడ్డిలోని రెండు సెంటర్లు ఇందీరా కాలనీకి రూ. 2లక్షలు, మార్క్స్నగర్కు రూ. 50 వేల నగదులను అందుకోనున్నాయి.
గ్రామీణ ప్రాం తంలో వైద్య సేవలు అందిస్తున్న సబ్ సెంటర్లలో కొండాపూర్ మండ లం మల్కాపూర్కు రూ. లక్ష, పట్టణంలోని పోతిరెడ్డిపల్లికి రూ. 50వేలు, సదాశివపేట మండలంలోని నందికంది సబ్ సెంటర్కు రూ. 35వేల నగదు పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిపై మరింత బాధ్యతను పెంచింది. యేటా కాయకల్పలో వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వ పరంగా మెరుగైన సేవలను గుర్తించి ప్రొత్సహాక పురస్కారాలు ప్రకటించి ప్రోత్సహిస్తున్న సర్కార్ తెలంగాణ అని ప్రజలు విశ్వసిస్తున్నారు.