సదాశివపేట, ఆగస్టు 23 : సదాశివపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు ఆధ్వర్యంలో జంట నాగుల విగ్రహ పత్రిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య లక్ష్మీ పూజ, మహాయజ్నం, పుణ్యాహవాచనం, మతృక నాంది, ఆవాహిత దేవతాపూజ, హవనం, ఫలాదివాసం, శయ్యదివాసం, ప్రతిష్టమహోత్సం, మహాబలి, పూర్ణాహుతి, మంగళహరతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని మార్కండేయ దేవాలయం నుంచి జంట నాగుల విగ్రహ ఊరేగింపు కనుల పండువగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులిమామిడి రాజు కుటుంబ సభ్యులు మమత, మాధవి, మనోజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్గౌడ్, ఆకుల శివకుమార్, ఇంద్రమోహన్గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు మనోహర్ గౌడ్, సోమశేఖర్, పరమదాసు, పద్మమాణిక్యం, చాపల హనుమంతు, బంటు రవి, బల్లెం సతీశ్, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తుల్జారం తదితరులు పాల్గొన్నారు.