సంగారెడ్డి, అక్టోబర్ 9: మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ..వారితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయించి గ్రామాల్లో ఏర్పాటు చేసే బైరిసన్స్ స్టోర్స్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని డీఆర్డీవో శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం పట్టణంలోని బైపాస్రోడ్డులో ఉన్న పాత డీఆర్డీఏ కార్యాలయంలో డీఆర్డీఏ సెర్ప్-బైరిసన్స్ అగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా ప్రతి గ్రామంలో బైరిసన్స్ స్టోర్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసే వస్తువులకు స్టోర్స్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో సూర్యారావు, డీపీఎం జయశ్రీ, బైరిసన్స్ అగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ప్రసాద్రావు, పాశం, మేనేజింగ్ డైరెక్టర్ బైరిరెడ్డి పాల్గొన్నారు.