మెదక్: జిల్లాలోని తూప్రాన్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు ఆగిపోయిన సమయంలో 70 మంది ప్రయాణికులున్నారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.