మెదక్, జనవరి 4 : నాలుగేండ్లలో రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 10 నాటికి రైతుల ఖాతాల్లో రూ.50వేల కోట్లు జమవుతున్న సందర్భంగా రైతుబంధు వారోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు చేరుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ఐక్యరాజ్యసమితి గుర్తించిందన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయొద్దని ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేల సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు.
8న జిల్లా కేంద్రంలో రైతులతో సంతకాల సేకరణ..
ఈ నెల 8న మెదక్ జిల్లా కేంద్రంలో రైతులతో సంతకాల సేకరణ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు పెద్దఎత్తున జిల్లా కేంద్రానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. 10న రైతుబంధు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఊరూరా జరుగుతాయని, అలాగే, ముగ్గుల పోటీ, వ్యాసరచన పోటీలు ఉంటాయని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 88 వేల మంది రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయనున్నట్ల చెప్పారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, కిశోర్, ఆర్కే శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, మధుసూదన్రావు, మోచి కిషన్, మధు, ఉమర్ పాల్గొన్నారు.