పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మదన్రెడ్డి, నియోజకవర్గ ప్రజలు
నర్సాపూర్, జనవరి 22: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేసినందుకు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను గతంలో కోరానన్నారు.
సీఎం స్పందించి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సూచించారని తెలిపారు. ఇందుకుగాను మంత్రిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాఘవేందర్రావు, హత్నూరా జడ్పీటీసీ ఆంజనేయు లు, బోర్పట్ల పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ హత్నూరా మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, శివంపేట్ మండల మండల అధ్యక్షుడు రమణ, నాయకులు నరేందర్రెడ్డి, బుచ్చిరెడ్డి, నవీన్రావు తదితరులు ఉన్నారు.