సిద్దిపేట, జనవరి 5: బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని గొల్ల చిన్నోళ్ల స్రవంతి చదువుకోసం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ చేతుల మీదుగా రూ.3.44లక్షల ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. దౌల్తాబాద్ మండలానికి చెం దిన నిరుపేద విద్యార్థిని స్రవంతి హార్టిసెట్లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించి, హైదారాబాద్లోని రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశం పొందింది.
చదువు కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.3.44లక్షల చెక్కును కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సివిల్ సైప్లె అధికారి హరీశ్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రటరీ బుచ్చ య్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.