చేర్యాల, మే 20 : ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రచారం నిర్వహిస్తే ఎన్ని సీట్లు వచ్చా యో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటమి పాలైన విషయం రేవంత్రెడ్డి మర్చిపోయి ఇష్టారాజ్యంగా టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏది మాట్లాడిన చెల్లుతుందనుకుంటే పొరపాటని, తెలంగాణ ప్రజలు వివేకవంతులనే విషయాన్ని గమనించాలన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉందని, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు దిక్కులేడని విమర్శించారు. తెలంగాణలో అక్కడక్కడ బహిరంగ సభలు పెట్టి హంగామా చేస్తే ప్రజలు అధికారం ఇవ్వరని, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే పార్టీని ఆదరిస్తారన్నారు. ఆయనతో నాయకులు విష్ణువర్ధన్, వెంకట్, నరేశ్, నవీన్ తదితరులు ఉన్నారు.