మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 17: మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని, తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టిందని పశువర్థక, మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని గోసంద్రం చెరువులో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, కలెక్టర్ రాజర్షిషా, మత్స్య శాఖ ఏడీ రజని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి 67,500 చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని 29 మత్స్య సహకార సొసైటీలకు చెందిన వెయ్యి మందికి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లలను వంద శాతం సబ్సిడీతో చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదులుతున్నదన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారునికి సభ్యత్వం కల్పిస్తున్నామని తెలిపారు. సహకార సంఘాల సమాఖ్య(టీఎస్ఎఫ్సీవోఎఫ్) ద్వారా రూ.వెయ్యి కోట్లతో ‘సమీకృత మత్స్య అభివృది’్ధ అనే బృహత్తర పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. చెరువుల్లో పెంచిన చేపలను గుత్తేదారులకు కాకుండా నేరుగా మత్స్యకారులే విక్రయించుకోవడానికి అవసరమైన వాహనాలు, కావాల్సిన పనిముట్లు, సామగ్రిని 75శాతం రాయితీపై అందించినట్లు తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, రమేశ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జట్పీటీసీ రమేశ్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, కిషోర్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, శివరామకృష్ణ, అరవింద్గౌడ్, వెంకటనారాయణ, మత్స్యకారులు తదితలు పాల్గొన్నారు