మెదక్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు పకాగా చేపట్టాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గం హవేళీ ఘనపూర్ మండలంలోని పోచమ్మరాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ను శుక్రవారం ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్తో కలసి ఆయన ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లను పరిశీలించి స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్రా కానుకల పంపిణీ చేసే అవకాశం ఉన్నందున, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిస్టికల్ అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, వ్యయ పరిశీలకుల బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నా రు. సీజ్ చేసిన వస్తువులకు వివరాలు కూడిన రసీదులను అందజేయాలని రాహుల్రాజ్ సూచించారు.