నర్సాపూర్/శివ్వంపేట, ఫిబ్రవరి 3 : రానున్న రోజు ల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లను పెట్టి నిరసన తెలిపి ప్రధానని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ రూ. 400 ఉన్న గ్యాస్ ధరలను నేడు రూ.1200 వరకు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో పేద ప్రజలపై తీవ్ర భారం పడి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు సరిత ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు రవీందర్గౌడ్, నగేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేటలో ..
కేంద్ర ప్రభుత్వం ప్రజలపై గ్యాస్ గుదిబండను మోపే మోదీ నిరంకుశ పాలనను తిప్పి కొట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో గ్యాస్ధరలకు నిరసనగా ప్రధానరోడ్డుపై వంటావార్పు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభా గం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ రవినాయక్, నాయకులు రాజశేఖర్గౌడ్, బోళ్ల ఆంజనేయులు, సూర్యం చౌహన్, నాయకులు ఉన్నారు.