మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ పాపన్న పేట/ రామాయంపేట/ చిలిపిచెడ్/ చేగుంట, ఆగస్టు 27 : 18 ఏండ్లు నిం డిన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. మెదక్ పట్ట ణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేయడా నికి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయా కేందాలను తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రమేశ్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వారీగా అర్హులైన ఓటర్లును గుర్తించి నమోదు చేయాలన్నారు. 2023, అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండనున్న ప్రతి ఒక్కరి పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు ఓటరు జాబితాలో పేర్లు, ఫొటోలను సరి చూసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అభ్యంతరాలు స్వీకరించ డానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవికుమార్, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
పాపన్నపేట మండలం ఎల్లాపూర్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని మెదక్ ఆర్డీవో అంబాదాస్రాజేశ్వర్ తనిఖీ చేసి, బీల్వోలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్బాబు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ఉన్నారు.
పారదర్శకంగా రూపొందించాలి : ఆర్డీవో వెంకటేశ్వర్లు
పెద్దశంకరంపేట మండలకేంద్రంతోపాటు ఆయాగ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను నారాయణఖేడ్ ఆర్టీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు ఫారం 6, 7, 8 స్వీకరణపై సూచనలు, సలహలు ఇచ్చారు. పారదర్శకం గా ఓటరు జాబితాను రూపొదించడంతోపాటు సవరణలపై ప్రచారం చేయాలన్నారు. ఓటరు నమోదు వేగవంతం చేయాలని, జాబితాలో తప్పులను సరిచేయాలన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ గ్రేసీబాయి, ఆర్ఐ శరణప్ప, ఈవో వెంకటరాములు, బీఎల్వోలు స్వరూప, నవనీత, మమత ఉన్నారు.
ప్రచారం చేయాలి : తహసీల్దార్ రజినీకుమారి
రామాయంపేట మండలవ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవాలని తహీసీల్దార్ రజినీకుమారి సూచించారు. గొల్పర్తి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, బీఎల్వోలకు సూచనలిచ్చారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా మార్పులపై ఓటరు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. కార్యక్రమం లో కౌన్సిలర్ మల్యాల కవిత, ఆర్ఐ రాజు ఉన్నారు.
ఓటరుగా చేరాలి : నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాస్
చిలిపిచెడ్ మండలంలోని జగ్గంపేట, గంగారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదు శిబిరాలను నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. 8 ఏండ్లు నిండిన ప్రతి యువతీయు వకులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమం లో సర్పంచ్లు మంతప్ప, మమతాబాబు ఉన్నారు.
18 ఏండ్లు నిండివారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను తహసీల్దార్ గియాసున్నిబేగం తనిఖీ చేశారు. చేగుంట, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో పర్యటించారు. 18 ఏండ్లు నిండినవారు ఓటుహక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింగ్యాదవ్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి ఉన్నారు.