మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బస్ డిపో వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున్గౌడ్ మాట్లాడుతూ బియ్యం,పప్పు దినుసులు, నూనె, పెరుగు, పన్నీర్, బ్రెడ్ వంటి వస్తువులపై జీఎస్టీ విధించడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉండాలి కానీ పన్నులు విధించే ప్రభుత్వాలు ఉండద్దొన్నారు. అంబానీ, ఆదానీల కోసం దోచిపెట్టే ప్రభుత్వాలు మాకొద్దాన్నారు. వెంటనే నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్ర మం లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఏఎం సీ చైర్మన్ మధుసూదన్రావు, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, వసంత్రాజ్, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, టీఆర్స్ నాయకులు శివరామకృష్ణ, మోచి కిషన్, సంగ శ్రీకాంత్, బొద్దుల కృష్ణ, ప్రసాద్, మహమ్మద్, నగేష్, సురేశ్, రుక్మాల్ చారి పాల్గొన్నారు.
జీఎస్టీకి నిరసనగా రాస్తారోకో
రాయికోడ్, జూలై 20: కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలపై నిరసన చేపట్టామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్ అన్నారు. బుధవారం రాయికోడ్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో బస్వరాజుపాటిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు రాస్తారోకో నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా దెబ్బతిస్తున్నదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ కార్మిక సంఘం కార్యదర్శి సతీశ్, మండల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..
చౌటకూర్,జులై 20: మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో చౌటకూర్ నుంచి నాందేడ్ వెళ్లే రహదారిపై నిరసన చేపట్టారు. నిత్యావసర సరుకులపై కేంద్రప్రభుత్వం విధించిన పన్ను భారాన్ని తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ రియాజొద్దీన్, ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అలీం, నాయకులు శ్రీనివాస్రెడ్డి, దేవయ్య పాల్గొన్నారు.
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి
టేక్మాల్, జూలై 20: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సూచన మేరకు బుధవారం టేక్మాల్ని చౌరస్తా వద్ద టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతు దేశానికి పల్లెలే పట్టుకొమ్మ లు అని నమ్మే మన దేశంలో పల్లెల్లో నివసించే రైతుల జీవనాధారమైన పాడి పరిశ్రమ రంగానికి చెందిన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడం సబబు కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిచో దేశ వ్యాప్త ఆందోళనకు కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్, డాక్టర్ సాయి, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ యాదయ్య, మాజీ డైరెక్టర్ గోవిందచారి పాల్గొన్నారు.
ప్రజల నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
మెదక్అర్బన్, జూలై20: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి కాలేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో బుధవారం జిల్లా మహాసభలో నూతనంగా ఎన్నికైనా సందర్భం గా సీపీఐ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభు త్వం పేదల నడ్డి విరుస్తున్నాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు విజయలక్ష్మి, రాజుగౌడ్, శేఖర్ పాల్గొన్నారు.