రామాయంపేట, నవంబర్ 23 : సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోఅన్ని వసతులను కల్పించి ప్రైవేటు బడులకు ధీటు గా తీర్చిదిద్దుతున్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం కాట్రియాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాట్రియాల ప్రభుత్వ పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నానని, పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పిస్తానన్నారు. సొంత నిధులతోపాటు దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తానన్నారు. మనఊరు-మనబడిలో భాగంగా ప్రతి పాఠశాలకు అభివృద్ధ్ది నిధులు మంజూరయ్యాయని అన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాలలను సందర్శించారు. అక్కడి నుంచి లక్ష్మాపూర్ గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి, దేవేందర్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మైలారం శాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు సుభాష్, మైసాగౌడ్, రాజేందర్గుప్త్తా, స్వామి, శ్రీశైలంరెడ్డి, సాయిరెడ్డి, దేవేందర్ ఉన్నారు.
పెద్దశంకరంపేట, నవంబర్ 23 : విద్యార్థినులు పౌష్టికాహరం తీసుకోవాలని పెద్దశంకరంపేట పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ భూమయ్య అన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాశాఖ, పోలీస్శాఖ, వైద్యశాఖ సమన్వయంతో క్లబ్ పనిచేస్తుందన్నారు. కమిటీలో ప్రతి తరగతి నుంచి ఇద్దరు అమ్మాయిలను సభ్యులుగా తీసుకున్న ట్లు తెలిపారు. విద్యార్థినులకు కమిటీ సభ్యులు ఆరోగ్య సంరక్ష ణతోపాటు పౌష్టిహాకారంపై అవగాహన కల్పించాలని సూచిం చారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనంతోపాటు వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాణి, వైద్య సిబ్బంది సంపూర్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.