మెదక్ మున్సిపాలిటీ/ చిలిపిచెడ్/ రామాయంపేట/ శివ్వంపేట, జూన్ 17 : జిల్లాలో ఎంపిక చేసిన 24 పాఠశాల ల్లో ఈ నెల 20న నిర్వహించే విద్యాదినోత్సవం నుంచి విద్యా ర్థులకు వారానికి మూడు రోజులు రాగి జావా పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జంబికుంట పాఠశాలలో జిల్లా సెక్టోరియల్ అధికారి సుదర్శనమూర్తి, మండల విద్యాధికారి నీలకంఠంతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జమీరొద్దీన్ కు రాగిజావా పౌడర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భం గా రాధాకిషన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థ ల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందజేస్తామన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు డీఈవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి పోషక విలువలు ఉన్న 10గ్రాముల రాగిజావా, 10 గ్రాముల బెల్లం అందజేస్తున్నదన్నారు. వీటిని 250 మిల్లీలీటర్ల నీటిలో ఉడికించి ఉదయం పూట విద్యార్థులకు అందజేయాలని సూ చించారు. ప్రతిరోజూ ఎంత మందికి అందజేస్తున్నారో స్టాక్ రిజిష్టర్లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలన్నారు.
నెలాఖరులోగా ‘మనఊరు-మనబడి’ పనులు పూర్తి చేయాలి : నోడల్ అధికారి విఠల్
చిలిపిచెడ్ మండలంలో కొనసాగుతున్న ‘మనఊరు- మనబడి’ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని మండల నోడల్ అధికారి విఠల్ సూచించారు. అజ్జమర్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పనులను సర్పంచ్ పరశురాంరెడ్డి, పాఠశాల చైర్మన్ వీరాస్వామితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి విఠల్ మాట్లాడు తూ.. అజ్జమర్రి ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు-మన బడి’ పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నెల 20న కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు పాఠశాలను ప్రారంభిస్తారని తెలి పారు. అప్పటి వరకు పనులను పూర్తి చేసి, పాఠశాలను సిద్ధ్దం చేయాలని కాంట్రాక్టర్, ప్రధానోపాధ్యాయుడు నరేశ్ను ఆదే శించారు. గౌతాపూర్ పాఠశాలలో మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కనకయ్య, షేక్ మదర్, రమేశ్ తదితరలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పర్నిచర్
రామాయంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉడెన్ ఫర్నిచర్ అందజేస్తున్నట్లు మండల విద్యాధికారి నీలకంఠం తెలిపారు. అక్కన్నపేట, ధర్మారం, రామాయంపేట బాలికల పాఠశాల, బీసీ కాలనీ పాఠశాల, హరిజనవాడ పాఠశాల, రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కోసం పర్నిచర్ అందజేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 8 పాఠశాలల హెచ్ఎంలు ఫర్నిచర్ను తీసుకెళ్లాలని సూచించారు.
విద్యార్థులకు నోట్బుక్స్ అందజేత
శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హైదరాబాద్కు చెందిన గాలి భిక్షపతి కుటుంబసభ్యులు సొంత ఖర్చులతో నోట్బుక్స్ అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాలి భిక్షపతి కుటుంబీకులు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. అనంతరం దాతను ఉపాధ్యాయులు సన్మాంనిచారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్యామలావెంకటేశ్, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు పవన్కుమార్గుప్తా, ఉపాధ్యాయులు సం తోష్, బాబా, లావణ్య, గాలి భిక్షపతి కుటుంబీకులు హరిత ప్రవీణ్, శ్వేత, వంశీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.