దుబ్బాక, డిసెంబర్ 14 : ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సకల వసతులతో కూడిన గుణాత్మక విద్య అందుతున్నదని జిల్లా విద్యాధికారి(డీఈవో) ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగపరచుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. గురువారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా వస్తువులు, స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. ప్రణాళికబద్ధంగా విద్యనభ్యసిస్తే..
ఉత్తమ ఫలితాలు సాధించగలరని సూచించారు. అనంతరం మండలంలో రఘోత్తంపల్లి, గోసాన్పల్లి, అచ్చుమయాపల్లి, కమ్మర్పల్లి, టేకుల తండా, శివాజీ నగర్, హబ్షీపూర్ పాఠశాలలతో పాటు అక్బర్పేట-భూంపల్లి మండలంలో ఎనగుర్తి, తాళ్లపల్లి, పోతారెడ్డిపేట, నగరం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను డీఈవో పర్యవేక్షించారు. ఉపాధ్యాయుల బోధన విధానాలను ఆయన పరిశీలించారు. బోధనలో టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్కనుగుణంగా ఎఫ్ఎల్ఎన్ డైరీలు, ఉన్నతి డైరీలు రాయాలని, విద్యార్థులకు అర్థవంతంగా బోధన చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ప్రభుదాస్ ఉన్నారు.