సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 22: పొద్దుతిరుగుడు సాగుచేసిన రైతులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభవార్త చెప్పారు. పొద్దుతిరుగుడు రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు బయట మార్కెట్లో పొద్దుతిరుగుడు పంట అమ్ముకొని నష్టపోతున్నారని, గతేడాది కూడా సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కూడా కొనుగోలు ఏర్పాటు చేయాలని గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో మాట్లాడానన్నారు. స్పందించిన మంత్రి ఈనెల 26వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పామన్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు మార్కెట్ యాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్నట్లు చెప్పారు. రూ.6,760 మద్దతు ధర చెల్లిస్తారని, రైతులు ప్రైవేటు మార్కెట్లో విక్రయించి నష్టపోవద్దని సూచించారు.