పటాన్చెరులోని సంఘాలను ప్రశంసించిన పంజాబ్ బృందం
పటాన్చెరు, జూలై 8: మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీలించింది. రెండు రోజులుగా ఇస్నాపూర్తో పాటు ఆయా గ్రామాల్లో బృందం పర్యటించింది. గ్రామాల్లో పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో మహిళలు పొదుపు ఎలా చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల పని తీరును ఐకేపీ అధికారుల సాయంతో ప్రత్యక్షంగా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న ప్రోత్సాహాన్ని మండల సమాఖ్య మహిళలు వారికి వివరించారు. గ్రూపులు పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, సమావేశాలు నిర్వహించి వాటిలో తీసుకునే నిర్ణయాలను వివరించారు. కొన్ని గ్రూపులు రూ.20 లక్షల రుణాలు తీసుకుంటున్నాయని తెలిపారు.
ప్రభుత్వం బాగా పని చేస్తున్న మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నదన్నా రు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, పెట్టుకు న్న వ్యాపార సంస్థల వివరాలు, మండల సమాఖ్య పని తీరును వారు రికార్డు చేసుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ బృందం ప్రతినిధులు మహిళా సం ఘాల సంఘటిత శక్తిని కొనియాడారు. ఆర్థికంగా వా రు కలిసికట్టుగా ముందడుగు వేస్తున్న విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో పంజాబ్ ప్రతినిధులు జస్పాల్ సింగ్, హరిప్రీత్సింగ్, రమణ్దీప్కౌర్, కరణ్జిత్సింగ్, సంగీత, డీపీఎం రవీందర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ జగదేవి, లక్ష్మి, నిర్మలా, నవీన్, విజయలక్ష్మి, సుజాత, ఐకేపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.