మెదక్, జనవరి 4: ఐదేండ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా వ్యవసాయ కమిటీ ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, జిల్లా దవాఖాన, ప్రాంతీయ దవాఖాన, కమ్యూనిటీ దవాఖానల్లో పనిచేసే చిన్న పిల్ల డాక్టర్లకు డీపీటీ(దిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం) సర్వెలెన్స్పై, పల్స్ పోలియో 2022 కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. 5 ఏండ్లలోపు పిల్లల్లో కోరింతదగ్గు, ధనుర్వాతం లక్షణాలు కనిపిస్తే వెంటనే నమోదు చేయాలని తెలిపారు. ఈ నెల 23న పల్స్ పోలి యో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లందరికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. మెదక్ జిల్లాలో 0-5 సంవత్సరాలోపు పిల్లలు 72,906 మందిని గుర్తించినట్లు తెలిపారు. వారికి 523 బూత్లు, 24 ట్రాన్సిట్ పాయింట్లు ద్వారా 92 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. డీపీటీ సర్వెలెన్స్ శిక్షణా కార్యక్రమాన్ని ఎస్ఎంవో మురారి పవర్ పాయిం ట్ ద్వారా వివరించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమిత్రారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నవీన్, విజయనిర్మల, అరుణశ్రీ, మాధురి, పీహెచ్సీలకు సంబంధించిన వైద్యాధికారులు చంద్రశేఖర్, మణికంఠ, ఆనంద్, డెమో పాండురంగాచారి, ఏఎస్వో శ్రావణి, హెచ్ఈవో ఫహీంపాషా పాల్గొన్నారు.